ఏపీలో మరో వైసీపీ ఎమ్మెల్యేకు కరోనా సోకింది. గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్యకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఓ వీడియో ద్వారా వెల్లడించారు. ఇటీవల ఎమ్మెల్యే కలెక్టరేట్లో సమావేశానికి వెళ్లగా.. ఇదే మీటింగ్లో పాల్గొన్న హోంమంత్రి, ఇతర ప్రజాప్రతినిధులు కరోనా టెస్టులు చేయించుకుంటున్నారు. కాగా ఇప్పటికే ఏపీలో నలుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీకి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే.