భారత్ లో అన్ లాక్ 2కు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. అన్ లాక్ 2లో కేంద్రం మరిన్ని సడలింపులు ఇచ్చింది. అన్ లాక్ 2 నిబంధనలు జూలై 1 బుధవారం నుంచి అమల్లోకి రానున్నాయి. వాటికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.కంటైన్మెంట్ జోన్లలో జూలై 31 వరకు లాక్డౌన్ అమలు. కంటైన్మెంట్ జోన్లలో అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి.దేశమంతటా రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలు.మెట్రో రైళ్లు, విద్యా సంస్థలు,కోచింగ్ సెంటర్లు, జిమ్లు, సినిమా హాళ్లు, బహిరంగ సభలు,స్విమ్మింగ్ ఫూల్స్,బార్ల పై జూలై 31 వరకు నిషేధం.సామాజిక,రాజకీయ,మతపరమైన సమావేశాల పై జూలై 31 వరకు నిషేధం.
కేంద్ర,రాష్ట్ర శిక్షణా సంస్థలకు జూలై 15 నుంచి కార్యకలాపాలకు అవకాశం.
అంతర్జాతీయ విమాన సర్వీసులపైనా జూలై నెలాఖరు వరకు నిషేధం కొనసాగుతుంది. ఐతే హోంశాఖ అనుమతిచ్చిన విమానాలకు మాత్రం అనుమతి ఉంటుంది.