కృష్ణా జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మచిలీపట్నంలో వైసీపీ నేత, మంత్రి పేర్ని నాని ముఖ్య అనచరుడు మోకా భాస్కరరావు దారుణ హత్యకు గురయ్యారు. ఆయన మార్కెట్లో ఉన్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి కత్తితో పొడిచి పరారయ్యాడు. దుండగుడి దాడిలో తీవ్ర గాయాలపాలైన భాస్కరరావును స్థానికులు హుటాహుటిన ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పాత కక్షల నేపథ్యంలోనే హత్య జరిగినట్లు ప్రాథమింగా భావిస్తున్నారు. భాస్కర రావు హత్య వార్త తెలుసుకొని వైసీపీ కార్యకర్తలు ఆస్పత్రి వద్దకు భారీగా చేరుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు మోహరించారు. కాగా, భాస్కరరావు గతంలో మచిలీపట్నం మార్కెట్ యార్డ్ ఛైర్మన్గా పనిచేశారు.