ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసీపీ నేతలు దళారుల అవతారమెత్తారంటూ ఎద్దేవా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 28, 2020, 08:50 PM

పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో కోట్లు దోచుకోవడానికి వైకాపా నేతలకు ముఖ్యమంత్రి జగన్ లైసెన్స్ ఇచ్చారంటూ తెలుగుదేశం నేతలు మండిపడ్డారు. రైతుల దగ్గర భూములను ఎక్కువ ధరకు కొనుగోలు చేయించి... వారి దగ్గర వైకాపా నేతలు కమీషన్లు తీసుకుంటున్నారని తెదేపానేత జీవీ ఆంజనేయులు ఆరోపించారు. ఆఖరికి రైతులు పంట విక్రయాలు జరిపే మార్కెట్ల దగ్గర సైతం వైకాపా నేతలు దళారుల అవతారమెత్తారంటూ తెదేపానేత నక్కా ఆనంద్‌బాబు దుయ్యబట్టారు. దోపిడి వ్యవస్థను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందంటూ విమర్శలు గుప్పించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com