గతేడాది మార్చి 15న జరిగిన వివేకానందరెడ్డి హత్య పురోగతి ఏమిటని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ప్రశ్నించారు. వివేకా హత్యకేసు సీబీఐ దర్యాప్తుకివ్వాలని నాడు శవం పక్కన నిలబడి అడిగింది మీరు కాదా? అని ఏపీ సీఎం జగన్ను ప్రశ్నించారు. గవర్నర్ని కలిసి వివేకా హత్య కేసును సీబీఐకి ఇవ్వండని కోరింది మీరు కాదా సాక్ష్యాత్తు హైకోర్టులో పిటిషన్ వేసి వివేకా హత్య కేసు సీబీఐ ఎంక్వైరీకి ఆదేశించమని కోరింది మీరు కాదా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఏడాది పిబ్రవరి 20న మీరు వేసిన పిటిషన్ ఎందుకు వెనక్కి తీసుకున్నారని నిలదీశారు. హైకోర్టు సీబీఐ ఎంక్వైరీకి ఆదేశించిన తర్వాత మీ ప్రభుత్వం దర్యాప్తును ఎంతవరకు పరిశీలించిందన్నారు. హైకోర్టు సీబీఐ ఎంక్వైరీకి ఆదేశించి 100 రోజులు దాటినా సీబీఐ దర్యాప్తు పురోగతి ఏంటి? ఇప్పటి వరకు జరిగిని దర్యాప్తుపై సీబీఐ ఒక ప్రకటన చేయాలని కోరారు. సీబీఐ వర్యాప్తు త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కూడా కేంద్ర హోంమంత్రికి, ప్రధానికి లేఖ రాయాలన్నారు. మృతుని కూతురు డాక్టర్ సునీత కూడా దర్యాప్తు పురోగతి వెల్లడించాలని సీబీఐకి లేఖ రాయాలని చెప్పుకొచ్చారు. సోషల్ మీడియా లాంటి చిల్లర కేసులకిచ్చిన ప్రాధాన్యత వివేక హత్య కేసుకు ఇవ్వటం లేదు’’ అని పేర్కొన్నారు.