కర్నూలు జిల్లాలో కరోనా మహమ్మారి తన ప్రతాపం చూపుతోంది. పగబట్టినట్లు జిల్లాలో తిష్టవేసింది. పట్టణాల నుంచి పల్లెటూర్ల వరకు అందర్నీ కబళించి వేస్తోంది. ఇకపోతే కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గంలో కరోనా దడపుట్టిస్తోంది. నాలుగు నెలలుగా జిల్లాలో కరోనా పంజా విసుతున్నప్పటికీ ఎన్నడూ లేనివిధంగా డోన్ లో తన ప్రతాపం చూపుతోంది. ఒకేసారి నియోజకవర్గంలో 17 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. అంతేకాదు ఒకరిని బలితీసుకుంది. గత 24 గంటల్లో ఒక వ్యక్తి కరోనాతో మృతి చెందాడు.
దాంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆయన కుటుంబ సభ్యులను క్వారంటైన్ కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో ఐదుగురు కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దాంతో డోన్ లో ఆందోళన నెలకొంది. దాంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నియోజకవర్గంలో అత్యధిక కేసులు నమోదు అవుతున్న ప్రాంతాన్ని రెడ్ జోన్ పరిధిలోకి తీసుకువచ్చారు. అంతేకాదు లాక్ డైన్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకే దుకాణాలు తెరిచేందుకు అనుమతి ఇచ్చారు. అలాగే ప్రజలు బయటకు రాకుండా తమకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.