నేటి నుంచి 28 వరకు హైకోర్టు విధులు నిలిపివేశారు. ఏపీ హైకోర్టు, విజయవాడ మెట్రో పాలిటన్ కోర్టులపై కరోనా ప్రభావం పడింది. ఈ నెల 28 వరకు హైకోర్టు విధులను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. చీఫ్ జస్టిస్ ఆదేశాలతో హైకోర్టు రిజిస్ట్రార్ సర్క్యులర్ జారీ చేశారు.ఏపీలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. కొత్తగా 553 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. కరొనతో ఏడుగురు మృతి చెందారు. విదేశాల నుంచి ఏపీకి వచ్చిన ఏడుగురికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చిన 69 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తేలింది. ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10,884 కి చేరింది. కరోనాతో మరణించిన వారి సంఖ్య 136కి చేరింది. డిశ్చార్జ్ అయినవారు 4988 మంది, యాక్టివ్ కేసుల సంఖ్య 5,760 గా ఉంది.