ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కరోనా కారణంగా ఢిల్లీ ఐఐటీ కీలక నిర్ణయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jun 25, 2020, 12:18 PM

కరోనా కారణంగా ఢిల్లీ ఐఐటీ కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ ఏడాది మొత్తం ఆన్ లైన్ క్లాసులు భోదించాలని  ఢిల్లీ ఐఐటీ నిర్ణయం తీసుకున్నది. పేద విద్యార్థులకు అవసరమైన ఆర్ధిక సాయం అందించాలని వినతి చేసింది.  దేశంలో కరోనా వైరస్ ఉద్ధృతి ఏమాత్రం తగ్గడంలేదు. పాజిటివ్ కేసుల్లో ఏ రోజుకారోజు కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 17వేలకుపైగా కొత్త కేసులు బయటపడ్డాయి. అన్ని రాష్ట్రాల్లోనూ రికార్డుస్థాయిలో పాజిటివ్ కేసులు నిర్ధారణ కావడం ఆందోళన కలిగించే అంశం. మంగళవారం దాదాపు 16వేల కేసులు నమోదుకాగా.. బుధవారం ఈ రికార్డు అధిగమించింది. అలాగే మరణాలు కూడా పెద్ద సంఖ్యలో నమోదుకావడం దేశంలో వైరస్ తీవ్రతకు అద్దంపడుతోంది. గత 24 గంటల్లో ఏకంగా 422 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా మరణాల సంఖ్య 15వేలకు చేరువయ్యింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com