కరోనా కారణంగా ఢిల్లీ ఐఐటీ కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ ఏడాది మొత్తం ఆన్ లైన్ క్లాసులు భోదించాలని ఢిల్లీ ఐఐటీ నిర్ణయం తీసుకున్నది. పేద విద్యార్థులకు అవసరమైన ఆర్ధిక సాయం అందించాలని వినతి చేసింది. దేశంలో కరోనా వైరస్ ఉద్ధృతి ఏమాత్రం తగ్గడంలేదు. పాజిటివ్ కేసుల్లో ఏ రోజుకారోజు కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 17వేలకుపైగా కొత్త కేసులు బయటపడ్డాయి. అన్ని రాష్ట్రాల్లోనూ రికార్డుస్థాయిలో పాజిటివ్ కేసులు నిర్ధారణ కావడం ఆందోళన కలిగించే అంశం. మంగళవారం దాదాపు 16వేల కేసులు నమోదుకాగా.. బుధవారం ఈ రికార్డు అధిగమించింది. అలాగే మరణాలు కూడా పెద్ద సంఖ్యలో నమోదుకావడం దేశంలో వైరస్ తీవ్రతకు అద్దంపడుతోంది. గత 24 గంటల్లో ఏకంగా 422 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా మరణాల సంఖ్య 15వేలకు చేరువయ్యింది.