పూరీ రథయాత్రకు సుప్రీం కోర్టు అనుమతిచ్చింది. భక్తులు పాల్గొనకుండా రథయాత్ర జరపాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. వివిధ నిబంధనలతో రథయాత్రకు సుప్రీం అనుమతిచ్చింది. రథయాత్ర నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వానికే వదిలివేస్తున్నామని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతాయుతంగా ఉండి... కరోనా వ్యాప్తిపై దృష్టి పెట్టాలని స్పష్టం చేసింది. రథయాత్ర నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహిస్తుందని ఒడిశా తరఫు న్యాయవాది హరీశ్ సాల్వే న్యాయస్థానానికి తెలిపారు. దీంతో రేపటి నుంచి పూరీ జగన్నాథ రథయాత్ర నిర్వహించనున్నారు.