ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైకోర్టులో అయ్యన్నపాత్రుడికి ఊరట..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 22, 2020, 02:23 PM

మాజీ మంత్రి, టీడీపీ నేత అయ్యన్నపాత్రుడికి హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై నమోదైన నిర్భయ కేసులో అరెస్టుపై కోర్టు స్టే ఇచ్చింది. ఈ కేసులో తదుపరి విచారణ వాయిదా వేసింది. విశాఖ జిల్లా నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణిని అసభ్యంగా దూషించారనే ఆరోపణలపై ఆమె చేసిన ఫిర్యాదుతో నిర్భయ చట్టం కింద అయ్యన్నపాత్రుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే తనపై పెట్టిన కేసును ఎత్తివేయాలని అయ్యన్నపాత్రుడు కోర్టును ఆశ్రయించారు. అరెస్టును నిలుపుదల చేయాలని కోరారు. దీంతో హైకోర్టు అరెస్ట్ పై స్టే ఇచ్చింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com