మాజీ మంత్రి, టీడీపీ నేత అయ్యన్నపాత్రుడికి హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై నమోదైన నిర్భయ కేసులో అరెస్టుపై కోర్టు స్టే ఇచ్చింది. ఈ కేసులో తదుపరి విచారణ వాయిదా వేసింది. విశాఖ జిల్లా నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణిని అసభ్యంగా దూషించారనే ఆరోపణలపై ఆమె చేసిన ఫిర్యాదుతో నిర్భయ చట్టం కింద అయ్యన్నపాత్రుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే తనపై పెట్టిన కేసును ఎత్తివేయాలని అయ్యన్నపాత్రుడు కోర్టును ఆశ్రయించారు. అరెస్టును నిలుపుదల చేయాలని కోరారు. దీంతో హైకోర్టు అరెస్ట్ పై స్టే ఇచ్చింది.