ఏపీలో ఖాళీగా ఉన్న 16,208 సచివాలయ ఉద్యోగాల భర్తీ కోసం ఆగస్ట్ 9-14 తేదీల మధ్య రాతపరీక్షలు నిర్వహించాలని పంచాయితీ రాజ్ శాఖ భావిస్తోంది. పరీక్షల కోసం రూపొందించిన షెడ్యూల్ ను తుది అనుమతి కోసం ప్రభుత్వానికి పంపింది. ఈ నెల 28 నాటికి పరీక్షా కేంద్రాల గుర్తింపు ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. పరీక్షల నిర్వహణకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు.