ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసిపి నేతలపై ఆరోపణలు చేసిన టీడీపీ నేత దేవినేని

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 21, 2020, 01:58 PM

లేటరైట్ గనులలో వందలకోట్ల దోపిడీ జరుగుతోందని మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. అసలు లీజుదారులను బెదిరించి అధికార పార్టీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో ఓ పోస్ట్ చేశారు. షాబాద్‌లో అక్రమ మట్టి దోపిడీతో కొండచరియలు విరిగిపడ్డాయని, ప్రొక్లైన్ పూర్తిగా ధ్వంసమైందన్నారు. ప్రొక్లైన్ ఆపరేటర్‌కు గాయాలయ్యాయని పేర్కొన్నారు. దీనిపై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. సొంత పార్టీ నాయకుల దోపిడీ తాడేపల్లి రాజప్రసాదానికి కనబడదా? అని ముఖ్యమంత్రి జగన్‌ను దేవినేని ఉమ ప్రశ్నించారు. ఈ మేరకు తన ట్వీట్‌లో రెండు వార్తా కథనాలను జత చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com