ఏపీ మంత్రి తానేటి వనిత గన్ మేన్ చంద్రారావు నడిరోడ్డుపైనే వీరంగం వేశారు. ఇటీవల చంద్రారావు కుమార్తె గాయత్రి 5 నెలల కిందట పోలీసుల సమక్షంలోనే ప్రేమ వివాహం చేసుకుంది. ప్రస్తుతం ఆమె గర్భావతి. అయితే కుమార్తె ప్రేమవివాహం చేసుకుని తన పరువు తీసిందని ఆగ్రహంతో ఊగిపోతున్న చంద్రారావు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో నడిరోడ్డుపైనే వారిపై దాడికి దిగాడు. కుమార్తెను, అల్లుడ్ని వెంట తరుముతూ, విచక్షణ రహితంగా కొట్టాడు. ఈ ఘటనలో చంద్రారావు, అతనికి సహకరించిన వ్యక్తులపై ఏలూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైనట్లు సమాచారం.