లాక్డౌన్ ఎత్తి వేసిన తరువాత కరోనా కేసులు పెరిగాయని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గిరీష తెలిపారు. గత 15 రోజులుగా కరోనా కేసులు పెరిగాయని.. నగరంలో 111 కేసులలో 32 మంది రికవరీ అయ్యారని పేర్కొన్నారు. ముగ్గురు కరోనా పాజిటివ్తో మృతి చెందారు. రెండు రోజులలో 30 కేసులు తిరుపతిలో నమోదు అయ్యాయన్నారు.
రానున్న 60 రోజులు ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. నగరంలో కరోనా సామాజిక వ్యాప్తిగా మారిందని గిరీషా తెలిపారు. 22 కంటోన్మెంట్ జోన్ లు ఉన్నాయని... వాటిలోని వారు ఎవ్వరూ బయటకు రావద్దని సూచించారు. తిరుపతి నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో 8 లక్షల మాస్కులు పంపిణీ చేశామన్నారు. 8 అర్బన్ హెల్త్ సెంటర్లలో పరీక్షల నిర్వహణకు ఏర్పాటు చేశామన్నారు. కరోనా
లక్షణాలుంటే
కచ్చితంగా టెస్టులు చేసే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు.
బయట నుంచి వచ్చిన వారి నుంచే ఎక్కువ కేసులు నమోదయ్యాయన్నారు.
బయట నుంచి వచ్చిన ప్రతీ ఒక్కరు హోమ్ క్వారంటైన్ తప్పక ఉండాలని తిరుపతి కమిషనర్ గిరీష తెలిపారు.