ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాసేపట్లో ఏపీ శాసనమండలి ముందుకు 3 రాజధానుల బిల్లు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 17, 2020, 12:06 PM

కాసేపట్లో ఏపీ శాసనమండలి ముందు 3 రాజధానుల బిల్లు ప్రవేశపెట్టనున్నారు.  బిల్లును మళ్ళీ ప్రవేశపెట్టడం నిబంధనలకు విరుద్ధమని టీడీపీ నేతలు అంటున్నారు. సెలెక్ట్ కమిటీ విషయంలోనూ స్పష్టత రావాల్సి ఉంది అని అన్నారు. మండలిలో బిల్లును అడ్డుకొనే తీరుతామని టీడీపీ నేత బుద్దా వెంకన్న అన్నారు. ఆర్టికల్ 197 ఈ సందర్బంగా వర్తించదు అని యనమల రామకృష్ణుడు తెలిపారు. బిల్లు కోర్టు పరిధిలో ఉంటే మళ్ళీ ఎలా ప్రవేశపెడతారు? అని యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. నిబంధనల ప్రకారమే బిల్లును మళ్ళీ మండలిలో ప్రవేశపెట్టామని ప్రభుత్వం అంటున్నది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com