కాసేపట్లో ఏపీ శాసనమండలి ముందు 3 రాజధానుల బిల్లు ప్రవేశపెట్టనున్నారు. బిల్లును మళ్ళీ ప్రవేశపెట్టడం నిబంధనలకు విరుద్ధమని టీడీపీ నేతలు అంటున్నారు. సెలెక్ట్ కమిటీ విషయంలోనూ స్పష్టత రావాల్సి ఉంది అని అన్నారు. మండలిలో బిల్లును అడ్డుకొనే తీరుతామని టీడీపీ నేత బుద్దా వెంకన్న అన్నారు. ఆర్టికల్ 197 ఈ సందర్బంగా వర్తించదు అని యనమల రామకృష్ణుడు తెలిపారు. బిల్లు కోర్టు పరిధిలో ఉంటే మళ్ళీ ఎలా ప్రవేశపెడతారు? అని యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. నిబంధనల ప్రకారమే బిల్లును మళ్ళీ మండలిలో ప్రవేశపెట్టామని ప్రభుత్వం అంటున్నది.