ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ (2020-21) సమావేశాల సందర్భంగా గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఉభయ సభలను ఉద్దేశించి మంగళవారం ప్రసంగించారు. గవర్నర్ తన ప్రసంగంలో ఏపీలో మూడు రాజధానుల అంశాన్ని కీలక అంశంగా ప్రస్తావించారు. శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు, కార్యనిర్వాహక రాజధానిగా వైజాగ్ ఉంటుందని గవర్నర్ స్పష్టం చేశారు. మూడు రాజధానుల ఏర్పాటు శాసన ప్రక్రియలో ఉందన్నారు. గవర్నర్ ప్రసంగంపై వివిధ పార్టీల నేతలు, అమరావతి రైతులు ఎలా స్పందిస్తారో చూడాలి.