ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గవర్నర్ ప్రసంగంలో ప్రధానాంశాలు ఇవే..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 16, 2020, 12:17 PM

అమరావతి : ఉత్పాదకత పెంచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని గవర్నర్‌ విశ్వభూషణ్ హరిచందన్ తెలిపారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలనుద్దేశించి గవర్నర్‌ ప్రసంగించారు. దేశంలోనే తొలిసారి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా గవర్నర్‌ ప్రసంగించారు


గవర్నర్ ప్రసంగంలో ప్రధానాంశాలు ఇవే....


1. మేనిఫెస్టోలో లేని 40 హామీలను అమలు చేశాం


2. జల, ఖనిజ వనరులను సద్వినియోగం చేసుకుంటున్నాం 


3. విద్యుత్‌, రవాణా, పరిశ్రమల అభివృద్ధికి కృషి చేస్తున్నాం


4. అణగారిన వర్గాలకు ఆర్థిక, సామాజిక, రాజకీయ హక్కులు కల్పించేందుకు చర్యలు


5. ప్రజలకు విద్య, వైద్యం అందించేందుకు అత్యంత ప్రాధాన్యత


6. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నాం


7. ఏడాదిలో రూ.42 వేల కోట్లతో సంక్షేమ పథకాలు


8. 18 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్‌మెంట్


9. రాష్ట్రంలో సేవారంగంలో 9.1శాతం వృద్ధి. పారిశ్రామిక రంగంలో 5 శాతం వృద్ధి


10. వ్యవసాయ అనుబంధ రంగాల్లో 8 శాతం వృద్ధి


11. 122 హామీల్లో 77 హామీలు నెరవేర్చాం..39 హామీలు పరిశీలనలో ఉన్నాయి


12. మన బడి పథకంలో 15700 స్కూళ్లలో మౌలిక వసతుల కల్పన


13. దశల వారీగా మూడేళ్లలో 45 వేల పాఠశాలల అభివృద్ధి


14. వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 6.20 లక్షల మందికి సేవలు


15. హైదరాబాద్, చెన్నై, బెంగూళూరులోనూ ఆరోగ్యశ్రీ సేవలు


16. వైఎస్‌ఆర్‌ కంటి వెలుగుతో 67 లక్షల మంది విద్యార్థులకు పరీక్షలు


17. విజయవంతంగా కొనసాగుతున్న వైఎస్‌ఆర్‌ టెలీ మెడిసిన్‌


18. నాడు- నేడు పథకం కింద ప్రభుత్వ ఆస్పత్రులను జాతీయ స్థాయిలో అభివృద్ధి


19. వైఎస్‌ఆర్‌ రైతు భరోసా ద్వారా ప్రతి రైతుకు 13,500 సాయం


20. కౌలు రైతులకు కూడా రైతు భరోసా వర్తింపజేస్తున్నాం






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com