ఏపీలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకు పెరుగుతోన్నాయి. గడిచిన 24 గంటల్లో 253 మంది కరోనా వైరస్ పాజిటివ్ బారిన పడ్డారు. ఇద్దరు చనిపోయినట్లు ఏపీ హెల్త్ బులెటిన్ విడుదలైంది. 82 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గత 24 గంటల్లో 15,633 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు. దీంతో ఏపీలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 4841గా ఉంది. అందులో 2723 మంది డిశ్చార్జ్ అయ్యారు. కర్నూలు జిల్లాలో ఒకరు, తూర్పు గోదావరి జిల్లాలో మరొకరు ఈరోజు మృతి చెందారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య 84కు పెరిగింది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 2034గా ఉంది.