ఏపీ సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఫ్రీగా బస్ పాస్లను జారీ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. డయాలసిస్ చేయించుకునేందుకు తరచుగా వెళ్లే కిడ్నీ పేషెంట్లకు ప్రయాణ ఛార్జీలు అధిక భారంగా మారుతున్నాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 10 లక్షల మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులను ఆదుకునేందుకు జగన్ సర్కార్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. పాక్షికంగా అంధత్వం కలిగిన వారికి కూడా ఫ్రీ పాస్లు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది.