ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకునే దిశగా సాగుతుంది. తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రద్దు చేసి విద్యార్దులందరిని పాస్ చేసిన విషయం తెలిసిందే. అదే విధంగా ఏపీలో కూడా పరీక్షలు రద్దు చేసే యోచనలో సర్కార్ ఉన్నట్టు సమాచారం. ఇప్పుడున్న పరిస్థితుల్లో పదో తరగతి పరీక్షలు నిర్వహించడం అసాధ్యమని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఒక వేళ సర్కార్ ముందుకు సాగినా కొంత మంది కరోనా పేరుతో కోర్టు మెట్లు ఎక్కే అవకాశం ఉంది. అప్పుడు కూడా చిక్కులు తప్పకపోవచ్చనే భావనలో ఏపీ సర్కార్ ఉంది. అందుకే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా తెలంగాణ సర్కార్ చేసినట్టుగానే ఏపీలో కూడా విద్యార్దులందరిని పరీక్షలు లేకుండానే పాస్ చేయాలనే యోచనలో సర్కార్ ఉందని సమాచారం.