ఒక వైపు పదో తరగతి పరీక్షలు ఉంటాయా? ఉండవా? అన్న చర్చ రాష్ట్రంలో జోరుగా సాగుతున్న సమయంలో పాఠశాలలను తెరవొద్దని హై కోర్టులో ఓ పిటీషన్ దాఖలైంది. రాష్ట్రంలో కరోనా కేసులు పూర్తిగా తగ్గేంతవరకూ లేదా వాక్సిన్ వచ్చే వరకూ స్కూళ్లు వద్దని ‘పేరెంట్స్ అసోసియేషన్’ అనే బృందం హైకోర్టులో ఓ ఆన్ లైన్ ద్వారా పిటీషన్ వేసింది. జూలై 1 నుంచి దశలవారీగా పాఠశాలలను తెరవాలని ప్రభుత్వం భావిస్తున్నసమయంలో హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలైంది.