భారత్ లో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. గత 24 గంటల్లో 9971 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,46,628కి చేరుకుంది. ఇప్పటి వరకు కరోనాతో కోలుకొని డిశ్చార్జు అయిన వారి సంఖ్య 1,19,293గా ఉంది. ప్రస్తుతం దేశంలో 1,20,406 యాక్టివ్ కేసులు ఉన్నాయి. భారత్ లో మొత్తం మరణాల సంఖ్య 6929కి చేరుకుంది.