ఆయన ఏపీ విద్యాశాఖలో హాస్టల్ వార్డెన్. ఇటీవలే బీసీ డైరెక్టరేట్ లో ఆన్ డ్యూటీ విధులకు వచ్చారు. ఆయనే ఉద్యోగి శ్రీనివాసరావు. అంతా ఆఫీసులో విధుల్లో నిమగ్నమై ఉంటే ఆయన మాత్రం టిక్ టాక్ లో నిమగ్నమై ఉంటాడు. ఆయన ఉన్నతాధికారులను మచ్చిక చేసుకొని జోరుగా పైరవీలు జరుపుతారని కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఓ అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టింగ్లో శ్రీనివాసరావు కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఉద్యోగం చేయకుండా టిక్ టాక్ లు చేయడం పై ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయి. అయినా ఆయన వయస్సుకు అమ్మాయిలతో టిక్ టాక్ లు చేయడం అవసరమా అంటూ అంతా అసహనం వ్యక్తం చేస్తున్నారు.