చిత్తూరు జిల్లాలో గ్రామ వాలంటీర్ పై దాడి జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. చిత్తూరు జిల్లా గంగవరం మండలం రెంటకుంట్లలో సౌమ్య అనే యువతి గ్రామ వాలంటీర్ గా పని చేస్తుంది. గ్రామంలో వైసీపీ కార్యకర్తలకు మాత్రమే సబ్సిడీ విత్తనాలు,హౌసింగ్ సరుకులు ఇవ్వాలని వైసీపీ నేత సావిత్రమ్మ సౌమ్యకు ఆర్డరేసిందట. తనకు తెలియకుండా వేరే వారి పేర్లు లబ్దిదారుల జాబితాలో పెట్టవద్దని కూడా సూచించిదని సమాచారం. దీనికి సౌమ్య ఒప్పుకోలేదు. పై అధికారులతో మాట్లాడుకోవాలని చెప్పింది. దీంతో ఆగ్రహించిన సావిత్రమ్మ నా సంగతి నీకు తెలియదు..ఉద్యోగం ఊడుతుందంటూ దాడి చేసిందని సౌమ్య ఆరోపిస్తుంది. ఈ ఘటన పై సౌమ్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.