ఏపీలో రోజు రోజు కి కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఏపీలో గత 24 గంటల్లో కొత్తగా 81 కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 1097కి చేరింది. వీటిలో 231 మంది డిశ్చార్జి అయ్యారు. 31 మంది చనిపోయారు. అందువల్ల ప్రస్తుతం ట్రీట్మెంట్ పొందుతున్నవారి సంఖ్య 835గా ఉంది. అయితే ఏపీలో పలు విద్యా సంస్కరణలు అమలు చేస్తున్న జగన్ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ప్రభుత్వ స్కూల్ విద్యార్థుల యూనిఫాం కలర్ మార్చనున్నట్లు తెలిపింది. వచ్చే ఏడాది నుంచి 6వ తరగతి నుంచి 10 తరగతి విద్యార్థుల యూనిఫాం కలర్ మార్చనున్నట్లు ఏపీ విద్యా శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు తెలుపు, నీలం, ముదురు నీలం రంగుల బట్టలు ఇస్తుండగా గులాబీ రంగు దుస్తులు ఇవ్వనున్నట్లు తెలిపింది. బాలురకు ప్యాంట్, షర్ట్, బాలికలకు పంజాబీ డ్రెస్ ఇస్తామని, బట్టను ప్రభుత్వమే పంపిణీ చేస్తుందని పేర్కొంది.