ఏప్రిల్ 20 నుంచి రెడ్ జోన్ లేని ప్రాంతాల్లో సడలింపునిస్తూ కేంద్ర ప్రభుత్వం పలు మార్గదర్శకాలు జారీ చేసింది. వాటిని పరిశీలించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం, ముఖాలకు మాస్కులు తొడుక్కోవడం, గుంపులుగా ఉండకుండా దూరంగా ఉండటం అనే నిబంధనలు కొనసాగనున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 647కి చేరితే... వాటిలో అత్యధికంగా గుంటూరు జిల్లాలో... 129 ఉన్నాయి. కర్నూలులో 158 ఉన్నాయి. ఏం చేసైనా గుంటూరులో కరోనాను కంట్రోల్ చెయ్యాలనుకుంటున్న ప్రభుత్వం... ఆ జిల్లాకు కొత్త రూల్స్ రెడీ చేసింది. సోమవారం నుంచి వాటిని అమల్లోకి తేబోతోంది. ఆ నిబంధనల్ని స్థానికులంతా పాటించాలని ప్రభుత్వం చెప్పింది. ఇలా... మే 3 వరకూ నిబంధనలు పాటిస్తే... కనీసం కరోనా కొత్త కేసుల సంఖ్య తగ్గే అవకాశం ఉందని అధికారులు అంటున్నా్రు.
ఇవీ కొత్త నిబంధనలు :
- ఉదయం 6 నుంచి ఉదయం 9 వరకే రోడ్లపైకి రావాలి.
- కిరాణా షాపులు, పండ్ల మార్కెట్, రైతు బజార్లు, జనరల్ మార్కెట్ మాత్రమే తెరిచి ఉదయం 9 వరకూ ఉంటాయి.
- ఉదయం 4 నుంచి 8 వరకు పాలు, పాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి.