లాక్డౌన్ వేళ అన్ని వ్యాపార కార్యకలాపాలు బంద్ కావడంతోపాటు, ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో తిండి దొరకక చాలామంది అల్లాడుతున్నారు. అయితే రాజస్థాన్లోని ఒక రైతు నిరుపేదలకు, వలస కూలీల కుటుంబాలను ఆదుకోడానికి తనకున్నదంతా ఇచ్చేశాడు. రాజస్థాన్లోని జోధ్పూర్ జిల్లాలోని ఓసియాన్కు చెందిన పబూరామ్ ఇప్పటివరకు రూ.50 లక్షల విలువైన సరుకులను వేలాది కుటుంబాలను ఇచ్చి ఆదుకున్నారు. ఇప్పటికే పరిసర ప్రాంతాల్లోని 83 గ్రామాల్లో 6వేలకుపైగా కుటుంబాలకు పబూరామ్ సరుకులను పంచిపెట్టారు. సంక్షోభ పరిస్థితుల్లో ఏ ఒక్కరూ ఆకలితో బాధపడకూడదని తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు పబూరామ్ తెలిపారు.