ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఘోర ప్రమాదం..డ్రైవర్,క్లీనర్ సజీవ దహనం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 17, 2020, 04:16 PM

పశ్చిమ గోదావరి జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్, క్లీనర్ సజీవదహనమయ్యారు. గుంటూరు నుంచి తణుకుకు స్పిరిట్ లోడ్ తో వెళుతున్న లారీ పెంటపాడు మండలం అలంపురం జాతీయ రహదారి పై అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. లారీలో స్పిరిట్ లోడ్ ఉండడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి లారీకి అంటుకున్నాయి. దీంతో లారీలో ఉన్న డ్రైవర్, క్లీనర్ లు సజీవ దహనమయ్యారు. లాక్ డౌన్ వల్ల రోడ్డంతా ఖాళీగా ఉండడంతో అతి వేగంగా డ్రైవర్ లారీ నడిపినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదం పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com