కరనా వైరస్ నియంత్రణలో భాగంగా విజయవాడ పోలీసు కమిషనరేట్లో 3వీ సేఫ్ టన్నెల్ను పోలీసు కమిషనర్ ద్వారకా తిరుమలరావు గురువారం ప్రారంభించారు. ఏసీటీ ఫైబర్ నట్ సహకారంతో సిబ్బంది సంక్షేమం కోసం ఈ టన్నెల్ను ప్రారంభించామని కమిషనర్ ఈ సం దర్భంగా తెలిపారు. 20 సెకన్ల పాటు టన్నెల్ నుంచి నడుచుకుంటూ వెళితే దుసు ్తలకు ఉన్న వైరస్ నసించే అవకాశం ఉందన్నారు. సిబ్బంది వైరస్ బారిన పడ కుండా మాస్కులు, పిీపీఈ కిట్స్ ఇస్తున్నామని కమిషనర్ తెలిపారు. విజయ వాడలోని ఆరు ప్రాంతాలను రెడ్ జోన్లుగా గుర్తించినందున ఆ ప్రాంతాల్లో ఎవ రూ ఆహారం సరఫరా చేయరాదని, ప్రభుత్వమే ఆహారం సరఫరా చేస్తుందని తెలి పారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.