విజయనగరం జిల్లా ఆర్టీసి డిపో మేనేజర్ ఆదేశాల మేరకు ఆర్టీసి ఉద్యోగులు గ్రామాల్లో వాలంటీర్లుగా సేవలందిస్తున్నారు. గురువారం పూసపాటిరేగ మండల కేంద్రంలోని కూరగాయల బజారులో వినియోగదారులు భౌతిక దూరాన్ని పాటించేలా ఆర్టీసీ ఉద్యోగులు అవగాహన కల్పిస్తున్నారు. స్థానిక ఎస్ఐ బాలాజీరావు అదేశాల మేరకు సేవలు అందించనున్నట్లు వాలంటీర్లు చెబుతున్నారు. ఆర్టీసి ఉద్యోగులు ఎం.సూర్యనారాయణ, జె.జనార్థన్ రావు, ఎం.భాస్కరరావు లు వాలంటీర్లుగా పని చేస్తున్నారు.