దేశమంతటా కరోనా మహమ్మారిపై చర్చ జరుగుతున్న వేళ.. సినీ దర్శకురాలు, సామాజికవేత్త నటాష్జ రాథోడ్ ట్విటర్లో పోస్ట్ చేసిన థ్రెడ్ వైరల్ అవుతోంది. ఆ థ్రెడ్లో ఏకంగా 69 ట్వీట్స్ ఉన్నాయి. ఓపిక ఉండి అన్నింటికీ సిద్ధపడితేనే ఈ ట్వీట్స్ చదవండని వార్నింగ్ మెసేజ్ పెట్టారు నటాష్జ. ప్రస్తుతం ఈ ట్విటర్ థ్రెడ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె ట్వీట్లు ఎంతో మంది ఇండియన్ ట్విటరాటీల దృష్టిని ఆకర్షించాయి. పెద్ద మొత్తంలో రీ ట్వీట్స్, లైక్స్, కామెంట్స్ వస్తున్నాయి. ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని కబళిస్తున్న కరోనా మహమ్మారి గురించి నటాష్జా ఈ ట్వీట్స్ చేశారు. కరోనా ప్రభావం, దాన్ని ఎదుర్కొనేందుకు ప్రధాని మోదీ చేస్తున్న కృషి, ఇతర దేశాల్లో పరిస్థితిని అందులో వివరించారు.భారత దేశ ఎన్నో దశాబ్ధాలుగా సామాజిక, రాజకీయ, ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటోందని.. వాటిని వివరించేందుకు తన తండ్రి ఎంతో శ్రమించారని పేర్కొన్నారు నటాష్జ. ఐతే ముఖ్యంగా అమెరికా రాజకీయ శాస్త్రవేత్త జెన్ షార్ప్ రాసిన పలు పుస్తకాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఎలాంటి హింస లేకుండా, ప్రజాస్వామ్య పద్దతిలో ప్రభుత్వాన్ని ఎలా పడగొట్టాలో పలు పుస్తకాల్లో ఆయన పేర్కొన్నారని.. అందుకోసం ఏకంగా 198 మార్గాలను చూపించారని తన ట్వీట్లో వివరించారు. ప్రధాని మోదీని గద్దె దింపేందుకు చేసే కుట్రలు ఈ ప్రజాస్వామ్య, లౌకిక దేశానికి మరింత హాని చేస్తాయని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీపై ప్రశసంలు కురిపించారు నటాష్జ.