ఆంధ్రప్రదేశ్లో గ్రామ, వార్డ్ వాలంటీర్లు మరోసారి తమ సత్తా చాటుతున్నారు. ఏప్రిల్ 1 నుంచి ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని అత్యంత విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఉదయం పది గంటల సమయానికే 77 శాతం పెన్షన్లను పంచేశారు. మధ్యాహ్నం కల్లా 100 శాతం కంప్లిట్ చేసేస్తారన్న విషయంలో మనకు ఎలాంటి డౌట్సూ అక్కర్లేదు. ప్రభుత్వం వాలంటీర్లకు తక్కువ జీతమే ఇస్తున్నా... వాళ్లు మాత్రం... ఎంతో నిబద్ధతతో పనిచేస్తున్నారు. ఎక్కడా ఎలాంటి పొరపాట్లూ జరగకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నారు. ముఖ్యంగా కరోనా వైరస్ టైంలో... బయోమెట్రిక్, వేలిముద్రలు, సంతకాలు లేకుండా పెన్షన్లను పంచుతూ... వైరస్ వ్యాప్తిని అడ్డుకుంటున్నారు.