మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కరోనాపై పోరాడేందుకు వైద్యవిద్యార్థులు, నర్సింగ్ విద్యార్థులను కూడా రంగంలోకి దించాలని కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ ప్రబలుతున్న ప్రస్థుత విపత్కర పరిస్థితుల్లో వైద్యవిద్యార్థులు, నర్సింగ్ విద్యార్థుల సేవలను ఉపయోగించుకోవడం ద్వారా వైద్యరంగంలో యువశక్తి పెరుగుతుందని డాక్టర్లు చెప్పారు. వైద్యవిద్యార్థుల సేవలను కూడా వాడుకోవాలని వైద్యమండలి నిర్ణయించడంతో వారు కూడా ముందుకు వచ్చారు. రోగుల సంఖ్య పెరిగితే వారికి వైద్యసేవలందించేందుకు వీలుగా ఫైనల్ ఈయర్ ఎంబీబీఎస్, పీజీ వైద్యవిద్యార్థులను రంగంలో దించారు. వైద్యవిద్యార్థులే కాకుండా నర్సింగ్ విద్యార్థుల సేవలను కూడా వినియోగించుకోవాలని నిర్ణయించారు.