ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ఎవరిని వదిలిపెట్టడం లేదు. నిన్న స్పెయిన్ రాణి కరోనాతో మృతి చెందగా, తాజాగా జపాన్ దేశానికి చెందిన వెటరన్ కమేడియన్ కెన్ షిమురా కరోనా వైరస్తో మరణించారు. 70 ఏళ్ల వయసున్న ప్రముఖ కమేడియన్ మార్చి 20వతేదీన జ్వరం, నిమోనియా లక్షణాలతో ఆసుపత్రిలో చేరారు. మార్చి 23వతేదీన కమేడియన్ కెన్ షిమురాకు కరోనా వైరస్ సోకిందని తేలింది. ఇతను చికిత్ప పొందుతూ నిమోనియా తీవ్రత పెరగడంతో మరణించారు. కాగా టోక్యో నగరంలోని హిగాషిమూరయమా ప్రాంతానికి చెందిన కెన్ షిమురా జపాన్ దేశంలోనే కరోనా వైరస్ సోకిన మొట్టమొదటి సెలబ్రిటీగా నిలిచారు.