దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న తరణంలో దేశరాజధాని ఢిల్లీ నగరంలోని ఆరు పెద్ద ప్రభుత్వ ఆసుపత్రులలో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం కరోనా వ్యాధి కమ్యూనిటీ స్థాయిలో వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కరోనా వైరస్ భారతదేశానికి సవాలుగా మారనుంది. ఈ నేపథ్యంలో దేశంలో వెంటిలేటర్ల కొరత తీవ్రంగా ఉంది. ఢిల్లీలోని ఎయిమ్స్తో సహా ఆరు ఆసుపత్రులలో 85 శాతం వెంటిలేటర్లు వినియోగంలో వున్నాయి. ఢిల్లీలోని ఎయిమ్స్, సఫ్దర్జంగ్, ఆర్ఎంఎల్, వల్లభాయ్ పటేల్ ఇనిస్టిట్యూట్, లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజీ, సుచేతా కృపాలానీ చిల్డ్రన్స్ హాస్పిటల్లలో వెంటిలేటర్ల కొరత తీవ్రంగా వుంది. ఈ ఆసుపత్రులలో ప్రస్తుతం 13 వెంటిలేటర్లు మాత్రమే ఖాళీగా ఉన్నాయి.