భారత ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్య ద్వైపాక్షిక చర్చలు ముగిశాయి. ఈ సందర్బంగా ఇరు దేశాలు కీలక ఒప్పందాలు కుదర్చుకున్నాయి.
భారత్-అమెరికా మధ్య కుదిరిన ఒప్పందాలు ఇవి.
- రక్షణ రంగంలో 3 బిలియన్ డాలర్ల ఒప్పందం.
- ఇంధన రంగంలో సహకారానికి ఒప్పందం. ఇండియన్ ఆయిల్, ఎక్సాన్ మొబిల్ మధ్య ఒప్పందం.
- వైద్య, ఆరోగ్య రంగంలో మరింత సహకారానికి ఒప్పందం. నాణ్యమైన మందుల సరఫరాకు ఒప్పందం.
- ఉగ్రవాదం పై ఉమ్మడి పోరుకు నిర్ణయం.
- భారీ వాణిజ్య ఒప్పందం పై చర్చల కొనసాగింపు.