హైదరాబాద్ హౌస్ లో ట్రంప్- మోడీ ద్వైపాక్షిక చర్చలు ముగిశాయి . ట్రంప్, మోడీ ఉమ్మడి మీడియా సమావేశం జరుగుతుంది. ఈ సందర్బంగా మోడీ మాట్లాడుతూ.. ట్రంప్ తో ఇది నాకు ఎనిమిదవ సమావేశం అని అన్నారు. ట్రంప్ కుటుంబ సమేతంగా రావడం సంతోషంగా ఉంది. రెండు దేశాల మధ్య స్నేహబంధం పెరిగింది. రక్షణ, సెక్యూరిటీ, ఐటీ వంటి అంశాలపై చర్చించామని మోడీ అన్నారు. నమస్తే ట్రంప్ కార్యక్రమం ఎప్పటికి గుర్తుండిపోతుంది. రక్షణ రంగానికి అత్యాధునిక ఆయుధాలు సమకూర్చుతున్నాయి. మానవ అక్రమ రవాణా, మాదకద్రవ్యాలు, స్మగ్లింగ్ పై ఉమ్మడి కార్యాచరణ అని అన్నారు.