కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అర్హులకు రాజధాని ప్రాంతంలో ఇళ్ల స్థలాల పంపిణి చేయనున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి, పెదకాకాని, మంగళగిరి, దుగ్గిరాలతో పాటు విజయవాడ సిటీ పరిధిలోని అర్హులకు సీఆర్డీఏలో ఇళ్ల స్థలాల పంపిణి చేయనున్నారు. మొత్తం 54,307 మందికి 1251.5 ఎకరాలు ఏపీ ప్రభుత్వం ఇవ్వనున్నది. లబ్దిదారులకు నౌలురు, కృష్ణాయపాలెం, నిడమర్రు, ఐనవోలు, కురగల్లు, మందడంలో భూములు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.