ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్ సస్పెన్షన్ ను రద్దు చేసిన క్యాట్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 25, 2020, 11:32 AM

ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్ సస్పెన్షన్ ను క్యాట్ రద్దు చేసింది. కేంద్ర సర్వీసులకు కృష్ణకిషోర్ వెళ్లేందుకు ట్రిబ్యునల్ అనుమతినిచ్చింది. కృష్ణకిషోర్ పై కేసులను చట్ట ప్రకారం ప్రభుత్వం పరిశీలించుకోవచ్చని క్యాట్ తెలిపింది. గత ప్రభుత్వంలో ఏపీ ఆర్థిక అభివృద్ధి మండలి సీఈవోగా పనిచేసిన కృష్ణ కిషోర్‌పై అవినీతి ఆరోపణలు రావడంతో జగన్ ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.  టీడీపీ ప్రభుత్వంలో ఏపీ ఆర్థిక అభివృద్ధి మండలి సీఈవోగా కృష్ణ కిశోర్‌పై మీద అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏపీ సీఐడీ ఆయనపై కేసు నమోదు చేసింది. ఈడీబీ సీఈవోగా ఉన్న సమయంలో ప్రభుత్వ అనుమతి లేకుండా రూ.కోట్ల విలువైన ప్రకటనలు జారీ చేశారన్న అభియోగాలపై ఆయనపై కేసులు పెట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com