డొనాల్డ్ ట్రంప్ కు స్వాగతం పలికేందుకు మనం వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్విట్ చేశారు. మరి నరేంద్ర మోదీకి స్వాగతం పలికేందుకు అమెరికా వాళ్లు కనీసం వేల రూపాయలైనా ఖర్చు పెడతారా? ఇది భారత్ ను ప్రశ్నించడం కాదు, అమెరికా గురించి చెబుతున్నానంతే!" అంటూ వర్మ ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు. రెండ్రోజుల పర్యటన కోసం భారత్ వచ్చిన ట్రంప్ కు అట్టహాసంగా స్వాగతం పలికిన సంగతి తెలిసిందే. ట్రంప్ కాలుమోపిన అహ్మదాబాద్ నగరం జనసంద్రాన్ని తలపిస్తోంది. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ రాకపై స్పందించారు.