తిరుమల: తిరుమల శ్రీవారి కొండపై గురువారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి ఒక కంపార్టుమెంట్లో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారిసర్వదర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది. అలాగే టైం స్లాట్, నడక, ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 68,065 వేల మంది భక్తులు దర్శించుకున్నారు.