ఏపీ ఇంటర్ బోర్డు విద్యార్దులకు షాకిచ్చింది. ఇక నుంచి కాలేజీలకు బంక్ కొడితే విద్యార్దులు భారీగా ఫైన్ చెల్లించుకోవాల్సిందే. విద్యార్దుల హాజరు మినహాయింపుకు సంబంధించిన రుసుమును ఇంటర్ బోర్డు భారీగా పెంచింది. 60 శాతం లోపు హాజరు ఉన్న విద్యార్ధులను ఇక నుంచి ప్రైవేట్ విద్యార్దులుగా గుర్తించనున్నారు. 60 నుంచి 75 శాతం హాజరు ఉన్న వారికి గతంలో రూ.200 నుంచి 500 రూపాయల వరకు ఫైన్ ఉండేది. ఇప్పుడు దానిని రూ.1000 నుంచి 2 వేల వరకు పెంచారు.
దీంతో విద్యార్దులు షాక్ అవుతున్నారు. ఇంటర్ బోర్డు ఇంత రుసుం పెడితే ప్రైవేట్ కాలేజీలు మరింత దండుకునే అవకాశం ఉందని విద్యార్ది సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్ బోర్డు వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించాలని లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని విద్యార్ది సంఘాల నాయకులు హెచ్చరించారు.