మన దేశంలో బ్రిటిషర్లు 71 ట్రిలియన్ డాలర్ల ఎకనామిని లూటీ చేశారని ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి అన్నారు. దేశానికీ స్వాతంత్య్రం వచ్చాక నెహ్రూ తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల దేశాభివృద్ధి ఆగిపోయిందని అయన తెలిపారు. రీపామ్స్ కు పీవీ నరసింహారావు ఆద్యుడు అని అయన తెలిపారు. పీవీ నరసింహారావు హయాంలోనే ఒక్క శాతం ఉన్న జీడీపీ 8 శాతానికి తీసుకెళ్లారని ఎంపీ సుబ్రమణ్యస్వామి తెలిపారు. పీవీ నరసింహారావుకు భారతరత్న ఇచ్చేందుకు పోరాడతా అని అయన తెలిపారు. దేశంలో అవినీతి తగ్గాలంటే ఇన్ కమ్ టాక్స్ రద్దు చేయాలి అని అన్నారు. అప్పుడే దేశ జీడీపీ కూడా పెరుగుతుందని అయన తెలిపారు.