ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొత్త సెలెక్టర్లకు వచ్చేనెలలో బాధ్యతలు

national |  Suryaa Desk  | Published : Tue, Feb 18, 2020, 01:39 PM

కొత్తగా ఎంపికయ్యే ఇద్దరు సెలెక్టర్లు వచ్చే నెలలో బాధ్యతలు చేపడతారని క్రికెట్‌ సలహా కమిటీ (సీఏసీ) సభ్యుడు మదన్‌లాల్‌ తెలిపాడు. చీఫ్‌ సెలెక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌, సభ్యుడు గగన్‌ఖోడా పదవీకాలం ముగియడంతో వారి స్థానాల భర్తీకి బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ‘రెండు పోస్టులకు 44 దరఖాస్తులు వచ్చాయి. న్యూజిలాండ్‌లో భారత పర్యటన పూర్తయ్యేనాటికి ఆ రెండు స్థానాలలో కొత్తవారిని ఎంపిక చేస్తాం’ అని మదన్‌లాల్‌ సోమవారం వెల్లడించాడు. వారు వచ్చే నెల తొలి వారంలో బాధ్యతలు చేపడతారని చెప్పాడు. మదన్‌లాల్‌కాక టీమిండియా మాజీ ఆటగాళ్లు ఆర్పీ సింగ్‌, సులక్షణా నాయక్‌ సీఏసీలో మిగిలిన ఇద్దరు సభ్యులు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com