ప్రస్తుతం కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సర్జికల్ మాస్క్ లు, గ్లోవ్స్ ఎగుమతి పై ఉన్న నిషేధాన్ని సర్కార్ ఎత్తి వేసింది. వ్యక్తిగత భద్రతకు సంబంధించిన అన్ని వస్తువుల ఎగుమతి పై కేంద్ర ప్రభుత్వం గత నెల నిషేధం విధించింది. కరోనా వైరస్ ప్రపంచ దేశాలను ఒణికిస్తుండడంతో ఈ నిషేధాన్ని ఎత్తేసింది. దీంతో మాస్క్ లు, సర్జికల్ గ్లోవ్స్ ఎగుమతి చేసుకునేందుకు అవకాశం లభిస్తుంది. సర్జికల్ మాస్క్ లు, ఒకసారి వాడి పారేసే మాస్క్ లు, ఎన్ బీఆర్ గ్లోవ్స్ తప్ప అన్ని రకాల గ్లోవ్స్ ను ఎగుమతి చేసుకోవచ్చు. వ్యక్తిగత భద్రతకు సంబంధించిన వస్తువులతోపాటు ఎన్-95 మాస్క్ లు ఎగుమతి చేసుకునేందుకు అవకాశం లేదని ది డెరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ ప్రకటించింది.