ఢిల్లీలో ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. పెద్ద సంఖ్యలో మహిళలు, యువత పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేస్తున్నారు. ఇవాళే పెళ్లి చేసుకున్న ఓ వధూవరులు పెళ్లి తర్వాత... డైరెక్టుగా ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. దీన్ని బట్టీ మనం అంచనా వెయ్యొచ్చు. ఈసారి ఢిల్లీలో పోలింగ్ భారీగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాయంత్రం ఆరు గంటల వరకూ పోలింగ్ కొనసాగనుంది.