న్యూజిలాండ్ పర్యటనలో భారత జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది... ఆఖరి టీ20 మ్యాచ్ లో గాయపడ్డ రోహిత్ శర్మ వన్డే, టెస్టు సిరీస్ కు దూరమయ్యాడు.. ఆదివారం జరిగిన మ్యాచ్ లో బ్యాటింగ్ చేస్తుండగా రోహిత్ శర్మ కండరాలు పట్టేయడంతో బ్యాటింగ్ కొనసాగించలేక పెవిలియన్ కు వెళ్లిపోయాడు... ఆ తర్వాత మైదానంలోకి దిగలేదు... ఈ నేపథ్యంలో, రోహిత్ గాయం తీవ్రత ఎక్కువగానే ఉందని, న్యూజిలాండ్ తో మూడు వన్డేలు, రెండు టెస్టులకు రోహిత్ దూరవవుతాడని బీసీసీఐ వర్గాలు తెలిపాయి... కివీస్ తో వన్డే సిరీస్ బుధవారం ప్రారంభం కానుంది...