టీడీపీలో ఇప్పుడు బాలకృష్ణ, ఆయన అల్లుడు నారా లోకేష్ కు సంబంధించిన చర్చ ఎక్కువగా నడుస్తోంది. చంద్రబాబు రిటైర్మెంట్ వయసు దాటి పోయిన నేపథ్యంలో టీడీపీలో ఆందోళన పెరుగుతోంది. చంద్రబాబు తర్వాత ఆ పార్టీని ముందుకు తీసుకువెళ్లే సమర్థుడైన మరొకరు కనిపించడంలేదు. దీంతో భవిష్యత్తుపై ఆ పార్టీ నాయకులకు రోజురోజుకు ఎక్కువవుతోంది. ప్రభుత్వంపై పోరాటం చేయడం, దీక్షలు, ధర్నాలు చేయడం ఎలా అన్నిటిలోనూ చంద్రబాబు తలకు మించిన భారంగా వ్యవహారాలను నడుపుకుంటూ.. విశ్రాంతి లేకుండా పని చేస్తున్నారు.
అయినా బాలకృష్ణ గాని. లోకేష్ గాని ఈ విషయంలో ముందడుగు వేసేందుకు సాహసించడం లేదు. దీనికి కారణాలు కూడా లేకపోలేదు. లోకేష్ రాజకీయంగా బలం పుంజుకోవడం, ప్రత్యర్థులపై విమర్శలు చేయడం ఇవన్నీ తిరిగి తిరిగి టీడీపీకి చేటు తెస్తాయనే విషయం చంద్రబాబుకు బాగా తెలుసు. అందుకే లోకేష్ ను ముందు పెట్టేందుకు చంద్రబాబు ఇష్టపడడం లేదు. ఇక బాలయ్య పొలిటికల్ గా బాగా యాక్టివ్ చేద్దామని చూస్తున్నా ఆయన కూడా దాదాపు లోకేష్ పరిస్థితినే ఎదుర్కొంటున్నారు. ఏదో మాట్లాడబోయి ఇంకా ఏదో మాట్లాడి అనవసర వివాదాలు తీసుకు వస్తాడు అనే సంగతి కూడా తెలుసు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఇద్దరినీ యాక్టివ్ చేయాలనుకున్నా వారు మాత్రం ఈ విషయంలో ముందడుగు వేసేందుకు ఇష్టపడడం లేదు. ఏదో ఒక పార్టీలో ఉంటూ అప్పుడప్పుడు టీడీపీ సమావేశాలకు, అసెంబ్లీ సమావేశాలకు హాజరు అవుతూ.. మిగతా సమయంలో సినిమా షూటింగుల్లో బిజీగా ఉంటున్నారు. హిందూపురం లోనూ ద్వారా బాలకృష్ణ పీఏల ద్వారా పరిపాలన చేస్తూ ఉన్నారు. దీంతో టీడీపీలోని ఒక రకమైన చర్చ జరుగుతోంది. లోకేష్ బాలయ్య ఇద్దరూ దొందూ దొందే నని, ఇద్దరి వల్ల పార్టీకి భారం తప్ప పెద్దగా కలిసి వచ్చేది ఏమీ ఉండదని, వీరిద్దరికీ ప్రత్యామ్నాయంగా మరికొంత మంది నేతలను ముందు జాగ్రత్తగా చంద్రబాబు తయారు చేసుకుంటే మంచిదని సలహాలు ఇస్తున్నారు. వీరిద్దరికి ఎంతగా ట్రైనింగ్ ఇచ్చినా రాజకీయంగా ఎంత పదును పెడతామని చూసినా అంతంత మాత్రంగానే ఫలితం ఉంటుందని టీడీపీకి మైలేజ్ తీసుకురాకపోగా అనవసర తలనొప్పిగా మారతారని చర్చించుకుంటున్నారు.