ఢిల్లి శాసనసభ ఎన్నికల బరిలో 668 మంది అభ్యర్థులు నిలిచారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తరువాత 668 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారని అధికారులు తెలిపారు. 30 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారని వారన్నారు. 70 సీట్లు కలిగిన ఢిల్లి శాసనసభకు ఫిబ్రవరి 8న పోలింగ్ జరుగనున్నది. ఫిబ్రవరి 11న కౌంటింగ్ జరుగుతుంది.