ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మమత సంగతి కేంద్రం చూసుకుంటుంది..: రామ్‌ మాధవ్‌

national |  Suryaa Desk  | Published : Tue, Dec 10, 2019, 07:40 AM

పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీపై బీజేపీ నేత రామ్‌ మాధవ్‌ తీవ్రస్థాయిలో స్పందించారు. పశ్చిమ బెంగాల్లో పౌరసత్వ సవరణ బిల్లును అమలు చేయకపోతే ఏమి చేయాలో కేంద్రానికి తెలుసునని ఆయన అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నంత కాలం రాష్ట్రంలో పౌరసత్వ సవరణ బిల్లును అమలు చేయబోమంటూ సీఎం మమత చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రామ్‌ మాధవ్‌ స్పందిస్తూ... పౌరసత్వ సవరణ బిల్లు పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం పొందితే అది రాజ్యాంగ చట్టమవుతుంది. ఒక రాషా్టన్రికి ముఖ్యమంత్రిగా రాజ్యాంగంలోని ప్రతి చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత మమతా బెనర్జీకి ఉంది. ఒకవేళ అందుకు ఆమె తిరస్కరిస్తే... కేంద్రం ఏమి చేయాలో అది చేస్తుంది.. అని పేర్కొన్నారు. పరపీడనకు గురై భారత దేశానికి వచ్చిన మైనారిటీల కోసం కేంద్రం పౌరసత్వ సవరణ బిల్లు తీసుకొస్తున్నట్టు రామ్‌ మాధవ్‌ పేర్కొన్నారు. వాళ్లు ఇక్కడ కనీసం ఐదేళ్ల పాటు ఉంటే భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చునన్నారు. శ్రీలంక, పాకిస్తాన్‌ దేశాల నుంచి భారత్‌లో ఆశ్రయం కోసం వచ్చిన వారితో సహా అనేక మందికి తాము శరణార్థుల హోదా ఇస్తున్నట్టు ఆయన వెల్లడించారు.
వాద్రా విదేశీ పర్యటనకు ఢిల్లీ కోర్టు ఓకే..న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు, వ్యాపారవేత్త రాబర్‌‌ట వాద్రా విదేశీ పర్యటనకు లైన్‌ క్లియర్‌ అయ్యింది. అక్రమ లావాదేవీల కేసులో నిందితుడిగా ఉన్న ఆయన.. విదేశీ పర్యటన కోసం పెట్టుకున్న పిటిషన్‌ మేరకు ఢిల్లీ ప్రత్యేక కోర్టు ఈ మేరకు అనుమతి ఇచ్చింది. లండన్‌లో ఓ ఆస్తి కొనుగోలులో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఎన్‌ఫోర్‌‌సమెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఆయనను విచారిస్తోంది. ప్రస్తుతం ముందస్తు బెయిల్‌పై ఉన్న ఆయనకు కోర్టు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లేందుకు అనుమతి లేదు. వైద్యం కోసం, వ్యాపార అవసరాల కోసం స్పెయిన్‌ వెళ్లేందుకు అనుమతించాలంటూ ఆయన కోర్టును ఆశ్రయించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com